ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధించాలనేది టాలీవుడ్ హీరోలలో ప్రతి ఒక్కరికి ఉండే కోరిక. అందుకోసం వారు తీసుకునే నిర్ణయాలు ఎంత ఆలస్యం అయినా అవి మూవీ సక్సెస్ కోసమే జరుగుతుంటాయి.
ఆ విధంగానే రామ్ చరణ్ తేజ్ సైతం గోవిందుడు అందరివాడే అనంతరం, తన అప్ కమింగ్ మూవీ ఎవరితో చేయాలనే దానిపై కొంత సమయం తీసుకున్నాడు. గోవిందుడు అందరివాడేలే మూవీ అనంతరం, రామ్ చరణ్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ కోసం ప్రయత్నం చేయగా, తరువాత అది ఆలస్యం అవుతుంది అన్న కారణంతో వెంటనే శ్రీను వైట్ల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
శ్రీనువైట్ల అప్పటికే ఆగడు మూవీతో భారీ డిజాస్టర్ డైరెక్టర్ గా ఉండగా, అటువంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ పనిచే యటానికి ముందుకు రావడం అనేది అందర్నీ ఆశ్ఛర్యపరిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, దర్శకుడు రెడీ చేసుకున్న స్క్రీన్ ప్లేని రామ్ చరణ్ తరుచూ చూడటం జరుగుతుంది.
స్క్రీన్
ప్లేలో కరెక్షన్స్ ఉంటే
కొద్దిపాటి మార్పులు చేయాల్సిందిగా
శ్రీనువైట్లని రామ్ చరణ్
కోరుతున్నట్టు తెలుస్తుంది.
దీంతో
శ్రీనువైట్లపై రామ్ చరణ్
ఒత్తిడి తెస్తున్నట్టుగా
ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్
వినిపిస్తున్నాయి.