ఏబీఎన్ రాధాకృష్ణ. మీడియాలో ఈయనంతటి మొండివాడు లేడు. పంతం వస్తే ముందూ వెనుకా చూడకుండా ఎందాకైనా వెళ్లడం రాధాకృష్ణ నైజం. గతంలో గవర్నర్లతోనూ, ముఖ్యమంత్రులతోనూ శత్రుత్వం పెట్టుకున్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గని చరిత్ర ఉందీయనకు.  

ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ సినీపరిశ్రమపై వరుస కథనాలిస్తున్నాడు. తాజాగా.. ఆయన సినీహీరోలపై రాసిన రాతలు సంచలనం కలిగిస్తున్నాయి. రెండు కులాలు, నాలుగు కుటుంబాల్లో జన్మించిన వ్యక్తులే ఇప్పుడు హీరోలవుతున్నారంటున్నారు రాధాకృష్ణ.

ముక్కూ మొహం సరిగా లేకపోయినా ఆ నాలుగు కుటుంబాలలో జన్మిస్తే సినిమా హీరో అయ్యే హక్కు ఆటోమాటిక్‌గా వస్తున్నదని..... ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించి మరీ జనం మీదకు వదులుతున్నారని రాశాడు. తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా హీరోల్లో … నవ రసాలను పోషించమని పరీక్ష పెడితే ఒక్క హీరో క కూడా  నిలబడలేరని   సవాల్ విసిరాడు..

రచయితలు రాసిన డైలాగ్స్‌ చెప్పుకొంటూ, డైరెక్టర్లు చేస్తున్న ట్రిక్కులతో చెల్లుబాటు అయిపోతున్నారని.....  కొంతమంది నిర్మాతలు డబ్బు సంచులతో ఆయా హీరోల గుమ్మాల ముందు పడిగాపులు కాస్తుండటంతో...  హీరోలకు తలపొగరెక్కిందని రాధాకృష్ణ సుతిమెత్తగా హీరోలకు వాతలు పెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: