గత  వారం విడుదల  అయిన మణిరత్నం ‘ఓకే  బంగారం’ మన తెలుగు రాష్ట్రాలలో  కన్నా తమిళనాడులో  అన్ని వర్గాల  ప్రేక్షకులకు నచ్చడంతో వీకెండ్  పూర్తి అయిన తరువాత కూడ కోలీవుడ్ లో  ఈ  సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉండటమే కాకుండా  రోజురోజుకు నెమ్మదిగా ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతూ  ఈ ఏటి  తోలి సమ్మర్ హిట్ గా కోలీవుడ్ లో రికార్డు క్రియేట్ చేయబోతోంది అని టాక్. ప్రముఖ సినీ ట్రేడ్  అనలిస్ట్  తరుణ్ ఆదర్శ్ తన ట్విటర్  లో తెలియచేసాడు. 


అంతేకాదు ఈ సినిమా గడిచిన నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 14.73 కోట్లు వసూలు చేసిందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈసినిమా తన అంచనాలను మించి విజయవంతం కావడంతో మణిరత్నం మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా ఈ  సినిమా కోసం కొందరు ఆత్మా హత్యలు  చేసుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.


కోలీవుడ్  మీడియా వస్తున్న వార్తలు


కోలీవుడ్ మీడియా వస్తున్న వార్తల  ప్రకారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్న 29 సంవత్సరాల  జైశంకర్ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ తాను ప్రేమిస్తున్న  అమ్మాయిని ఈ  సినిమాకు రావలసింది గా ఎన్నిసార్లు  కోరినా ఆమె నిరాకరించడంతో కోపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్  మీడియా వార్తలు వ్రాస్తోంది.


ఈ వార్తలు ఇలా ఉండగా తమిళనాడుకు  చెందిన సత్య ప్రియ అనే మహిళ తన  భర్త పళనీ స్వామిని షాపింగ్ కు తీసికి వెళ్ళి  ఆ తరువాత ‘ఓకే బంగారం’  సినిమాకు తీసుకు వెళ్ళమని ఎన్నిసార్లు  అడిగినా ఆమె భర్త  పట్టించుకోక  పోవడంతో నిరాశ చెందిన ఆమె కోపం తో ఆత్మ హత్య చేసుకుందట. ఇలా ఒక సినిమా కోసం ఆత్మ హత్యలు దాక వెళ్ళిపోతూ ఉండటం  చూస్తూ ఉంటే మణిరత్నం ‘ఓకే  బంగారం’  కోలీవుడ్ లో   సూపర్ సక్సస్ సాధించడం ఖాయం అనే మాటలు గట్టిగా  వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: