ప్రస్తుతం ఫిల్మ్ ఇండీస్ట్రీలో తాప్సీకి చెందిన న్యూస్ హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా స్వీటీ లిప్స్ తాప్సీ, ఎక్కువుగా మూవీలు చేయటం లేదు. అలాగని సినిమాలు చేయకుండా ఉండటం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఈ మూడు ఫిల్మ్ ఇండస్ట్రీలలో అవకాశాలు ఎక్కడ వస్తే, అక్కడ సినిమాలు ఒప్పుకుంటూ ఉంది. కాకపోతే తనని వరించే మూవీలు చాలా తక్కువుగా ఉన్నాయి.

దీంతో ఆఫర్స్ తగ్గటంతో ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త బిజినెస్ అవతారం ఎత్తనుంది. ఇప్పటివరకూ కేవలం నటనకే పరిమితమైన తాప్సీ ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, తాప్సీ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తూనే, మరోవైపు సినీ నిర్మాణం వైపు అడుగులు వేస్తుంది. గత రెండు సంవత్సరాలు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని పూర్తి చేసుకుంటుంది.

ఈ సంవత్సరం చివరిలో తాప్సీ నిర్మాతగా బాలీవుడ్ లో ఒక మూవీ, అలాగే 2016 లో టాలీవుడ్ లో ఒక మూవీ రానుంది. బాలీవుడ్ లో తను నిర్మాతగా ఉంటున్న మూవీలో హీరోగా షాహిద్ కపూర్ నటించే అవకాశం ఉందని బిటౌన్ నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా తాప్సీ నిర్మాతగా ఓ మూవీ రానుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.

మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా సమయంలో ప్రభాస్ కాల్షీట్స్ ని తాప్సీ తీసుకున్నట్టు టాక్స్. గతంలో ప్రభాస్ హీరోగా, తాప్సీ నిర్మాతగా ఓ రోజు వస్తుంది చూడూ అంటూ తాప్సీ ప్రభాస్ కి చెప్పుకొచ్చిందట. ఇప్పుడు ఆ సమయం తొందరలోనే ఉండటంతో ప్రభాస్ ఆశ్ఛర్యపడుతున్నాడంట.

మరింత సమాచారం తెలుసుకోండి: