అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు సతీష్ కాసెట్టి మాట్లాడుతూ "35 రోజులలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించి పూర్తి చేసాం. 'టెర్రర్' అనేది ఓ పోలీస్ కథ. ఈ సినిమా థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతుంది. పోలీస్ పాత్రలో శ్రీకాంత్ గారు అధ్బుతంగా నటించారు. ఈ సినిమాలో నటించిన వారందరూ హైదరాబాదీలే.. 140 నిమిషాలు సాగే ఈ సినిమాలో పాటలు లేవు.నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన షేక్ మస్తాన్ గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.షేక్ మస్తాన్ మాట్లాడుతూ "నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. పొలిటికల్ స్టొరీ తీయమని సతీష్ గారిని కలిస్తే ఆయన 'టెర్రర్' స్టొరీ ని తెరకెక్కించేలా నన్ను ఒప్పించారు. 120 సినిమాలలో హీరోగా నటించిన శ్రీకాంత్ గారు ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది" అని చెప్పారు.లక్ష్మి భూపాల్ మాట్లాడుతూ "ఇప్పటివరకు 40 సినిమాలకు మాటలు అందించాను.


టెర్రర్ సినిమాలో శ్రీకాంత్ 


అవన్నీ ఓకే ఎత్తయితే 'టెర్రర్' ఒకటి ఒక ఎత్తు. నాతో డైలాగ్స్ ఎలా రాయించుకోవాలో సతీష్ గారికి బాగా తెలుసు. డైలాగ్స్ చాలా రియల్ గా ఉంటాయి. ఒక మంచి సినిమా అవుతుంది" అని చెప్పారు.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ "డిఫరెంట్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అని చెప్పారు.శ్రీకాంత్ మాట్లాడుతూ "ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాను. ఇంతకముందు సినిమాలో కూడా పోలీస్ గా నటించాను. కానీ ఈ సినిమాలో చాలా భిన్నంగా కనిపిస్తాను. హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన చిత్రమిది. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా హొమ్ వర్క్ చేసారు. ఈ సినిమాలో నటించి త్రుప్తి గా ఫీల్ అవుతున్నాను" అని అన్నారు.ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: బసవ పైడి రెడ్డి, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: రన్ జాషువా, సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: షేక్ జైన్ లాబ్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి.

మరింత సమాచారం తెలుసుకోండి: