మంచు లక్ష్మి.. విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్ర్తత్యక స్థానం సంపాదించుకుంటోంది. కేవలం యాక్టింగ్ ద్వారానే కాకుండా చిత్ర నిర్మాణంలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తోంది. మరోవైపు తాజాగా తన సొంత చిత్రంలో పాట కూడా పాడేసింది. 


తాజాగా ఆమె నిర్మించిన చిత్రం దొంగాట. విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మించింది. లక్ష్మి, అడవి శేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే 1న ఈ చిత్రాం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


ఈ చిత్రం గురించి ఏర్పటు చేసిన ప్రెస్ మీట్లో.. మంచు లక్ష్మీ ఎంతో సంతోషంగా కనిపించింది. తన సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేయడమే ఇందుకు కారణమట. 
ఊరికే మాటలతో చెప్పకుండా.. చిన్నపిల్లలా.. నా సినిమా బిజినెస్ అయిపోయిందోచ్.. అంటూ నాట్యం చేసేసింది. 


నిర్మాతగా ఇప్పుడు తనకున్న టెన్షన్ అంతాపోయిందని..ఇక ప్రేక్షకురాలిగా సినిమాను ఎంజాయ్ చేస్తానని అంటోంది. ఈ సినిమా కు నైజాం, సీడెడ్, ఆంధ్రా ఏరియాల్లో మంచి బిజినెస్ ఆఫర్స్ వచ్చాయట. ఆ ఏరియాల్లో సినిమాని అమ్మేశారట. ఓవర్సీస్, బెంగుళూరు వంటి చిన్న ఏరియాలే మిగిలాయట. ఈ సినిమాలో తన పాట హైలెట్ గా నిలుస్తోందంటోంది లక్ష్మి. 


మరింత సమాచారం తెలుసుకోండి: