ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే అతి కొద్ది రోజులుగా టాలీవుడ్ కి చెందిన బడా నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ ఆఫీసు పైన దాడులు జరిగాయి అలాగే ఆయనపై కూడా దాడి జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం బెల్లంకొండ వాహనం ఒక యువకుడిని గుద్దడం, ఆ యువకుడు ప్రస్తుతం హాస్పిటల్ లో ఉండడం. కానీ తాజాగా బెల్లంకొండ తనపైన జరిగిన దాడిలో వాస్తవం లేదని అన్నాడు. ఎవరో కావాలనే తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారటూ మండిపడ్డాడు.

ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చిన బెల్లంకొండ సురేష్ ‘నా ఆఫీస్ మీద ఎవరు దాడి చేయలేదు, అలాగే నా మీద ఎవరూదాడి చేయలేదు. బయట వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీడియా వారు ఒక వార్త రాసే ముందు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని’ ఆయన అన్నాడు.

అయితే బెల్లంకొండ ఆఫీస్ పై దాడి జరగటం వంటి ద్రుశ్యాలను మీడియా ప్రత్యక్షప్రసారంగా చూపించింది. కాని బెల్లంకొండ చెప్పిన ప్రెస్ మీట్ అనంతరం ఏది నిజమో, ఏది అబద్దమో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: