హీరో జగపతిబాబు పేరు చెపితే అతడికి సెంటిమెంట్స్ ఉండవని ఎప్పుడూ సరదాగా పార్టీలు చేసుకుంటూ కాలం  గడుపుతూ ఉంటాడని ఒక ప్రచారం ఆయన పై  ఉంది. అయితే జగపతిబాబులోని మరో కోణాన్ని బయట పెడుతూ ఒక ప్రముఖ దిన పత్రిక ప్రచురించిన ఇంటర్వ్యూ చాలామందిని ఆశ్చర్య పరిచింది. బయటకు కనిపించే తనలోని రెక్లెస్ నేచర్ వెనుక జగపతిబాబు బయట పెట్టిన ఆధ్యాత్మిక కోణం ఆశ్చర్యాన్ని కలిగించింది. 


జీవితాన్ని ఆస్వాదించడం అంటే పార్టీలు చేసుకోవడం కాదు అని అంటూ ఆధ్యాత్మిక బాటలో వెళ్ళినప్పుడు మాత్రమే  మనకు జీవితమంటే ఏమిటో తెలుస్తుందని కామెంట్స్ చేసాడు జగపతి. సూపర్ స్టార్ రాజినీకాంత్ తో తాను ‘కథానాయకుడు’ లేటెస్ట్  గా ‘లింగ’ సినిమాలలో నటించినప్పుడు రజినీకాంత్ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలను తనకు వివరించడమే  కాకుండా ధ్యానంలో మన మనస్సును ఏ కాగ్రతలో పెట్ట గలిగితే భగవంతుడు మనకు ఎలా కనిపిస్తాడో రజినీకాంత్  తనకు తెలియచేసాడని వివరించాడు జగపతి.


 రజినీకాంత్ తనకు  బహుమతిగా ఇచ్చిన  ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ పుస్తకంతో తన ఆలోచనలు  పూర్తిగా మారిపోయాయి అని అంటూ తాను  ఈమధ్య ప్రశాంతత కోసం ‘కల్కీ భగవాన్’, ‘విపాసనా’, ‘కర్తా ళ్’ ఆశ్రమాల నుండి హిమాలయాల వరకు వెళ్ళి వచ్చానని తెలియ చేసాడు జగపతి. తన జీవితం పై తనకు ఉన్న సందేహాలు ఈ ఆధ్యాత్మిక సాధన వల్ల తొలిగి పోవడమే కాకుండా అప్పుడప్పుడు ఈ సాధన వల్ల తన శరీరం మెల్లగా పైకి లేచినట్లు అనిపిస్తుంది అని కామెంట్స్ చేసాడు జగపతి.


ఇదే  ఇంటర్వ్యూలో మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు జగపతిబాబు. తన భార్య షిరిడీ బాబా భక్తురాలు కావడంతో తనకు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చిన్న వీధిలో  ఒక రాయి పై  కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుని ధ్యానం చేస్తున్న సాయిబాబా తన వంక ధీనంగా చూస్తున్న దృశ్యం తన  మనస్సులో మెదిలింది అని కామెంట్ చేసాడు జగగపతి బాబు. దీని అర్ధం గురించి చాల రోజుల ఉ ఆలోచించన తరువాత తనకు  ‘పిచ్చోడా పోరా నువ్వు బాగుపడితే బాగుంటుంది’ అన్న అర్ధంతో తన వంక బాబా చూసినట్లుగా భావన కలిగిందని బాబా  పై కామెంట్స్ చేసాడు జగపతి.  ఈ సంఘటన జరిగిన తరువాత జగపతి బాబు తన హీరో ప్రయత్నాలను  మానుకుని విలన్ గా  మారి పోయానని చెప్పుకొచ్చాడు జగపతి. ఏది ఏమైనా టాలీవుడ్ విలాస పురుషుడిగా ఉన్న జగపతి  బాబు ఆధ్యాత్మిక వేత్తగా  మారాడు అనుకోవాలి..







మరింత సమాచారం తెలుసుకోండి: