జీవితాన్ని ఆస్వాదించడం అంటే పార్టీలు చేసుకోవడం కాదు అని అంటూ ఆధ్యాత్మిక బాటలో వెళ్ళినప్పుడు మాత్రమే మనకు జీవితమంటే ఏమిటో తెలుస్తుందని కామెంట్స్ చేసాడు జగపతి. సూపర్ స్టార్ రాజినీకాంత్ తో తాను ‘కథానాయకుడు’ లేటెస్ట్ గా ‘లింగ’ సినిమాలలో నటించినప్పుడు రజినీకాంత్ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలను తనకు వివరించడమే కాకుండా ధ్యానంలో మన మనస్సును ఏ కాగ్రతలో పెట్ట గలిగితే భగవంతుడు మనకు ఎలా కనిపిస్తాడో రజినీకాంత్ తనకు తెలియచేసాడని వివరించాడు జగపతి.
ఇదే ఇంటర్వ్యూలో మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు జగపతిబాబు. తన భార్య షిరిడీ బాబా భక్తురాలు కావడంతో తనకు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చిన్న వీధిలో ఒక రాయి పై కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుని ధ్యానం చేస్తున్న సాయిబాబా తన వంక ధీనంగా చూస్తున్న దృశ్యం తన మనస్సులో మెదిలింది అని కామెంట్ చేసాడు జగగపతి బాబు. దీని అర్ధం గురించి చాల రోజుల ఉ ఆలోచించన తరువాత తనకు ‘పిచ్చోడా పోరా నువ్వు బాగుపడితే బాగుంటుంది’ అన్న అర్ధంతో తన వంక బాబా చూసినట్లుగా భావన కలిగిందని బాబా పై కామెంట్స్ చేసాడు జగపతి. ఈ సంఘటన జరిగిన తరువాత జగపతి బాబు తన హీరో ప్రయత్నాలను మానుకుని విలన్ గా మారి పోయానని చెప్పుకొచ్చాడు జగపతి. ఏది ఏమైనా టాలీవుడ్ విలాస పురుషుడిగా ఉన్న జగపతి బాబు ఆధ్యాత్మిక వేత్తగా మారాడు అనుకోవాలి..