తెలుగు, తమిళ, మళియాల భాషల్లో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన నటి ప్రియమణి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో అమాయకంగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక నితిన్ తో నటించిన ద్రోణ సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కించింది. తర్వాత వచ్చిన పెళ్లయిన కొత్తలో, టాస్, యమదొంగ, శంభో శివ శంభో, గోలీమార్, చండి తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ప్రియమణి ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడంలేదు. ఆ మధ్య వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో షారూఖ్ ఖాన్ పక్కన ఐటమ్ సాంగ్ లో వచ్చిన ఈ చిన్నది తర్వాత చాలా గ్యాప్ వచ్చింది.


ద్రోణ సినిమాలో ప్రియమణి హాట్ పిక్


 టాలీవుడ్ తెరపై ప్రియమణి కనిపించి, దాదాపు రెండేళ్లయ్యింది. మలయాళంలో ఓ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అలాగే, ఓ కన్నడ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఆరంభం కానున్న ఓ మలయాళ చిత్రంలో నటించబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు లేవు.


ప్రియమణి హాట్ హాట్ అందాలు...


మరి ఈ అమ్మడి మనసు పెళ్లివైపు మళ్లిందట. అంతే కాదు   వచ్చే ఏడాది నా పెళ్లి అంటూ ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియమణి పేర్కొంది. ఇది పెద్దల సమ్మతంతో జరగనున్న ప్రేమ వివాహం అనీ, సంప్రదాయబద్ధంగా జరుగుతుందని ప్రియమణి తెలిపింది. సో.. ప్రియమణి ప్రేమలో పడిందని అర్థమవుతోంది. అతగాడి వివరాలను మాత్రం తెలియజేయలేదు. తన కాబోయే భర్త సినిమా పరిశ్రమకు చెందినవాడు కాదని చెప్పింది. మన దేశానికి చెందినవాడా? విదేశీయా అనేది ఇప్పుడు చెప్పనని తెలిపింది. కానీ, పెళ్లి మాత్రం వచ్చే ఏడాది జరుగుతుందని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: