నిత్యామీనన్ పొట్టిగా ఉన్నా ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తుంది అన్న పేరు ఉంది. అందుచేతనే టాప్ దర్శకులు అందరూ నిత్యామీనన్ ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే నిత్యామీనన్ సరిగ్గా నటించడం లేదు అంటూ లారెన్స్ పెట్టిన టార్చర్ ను స్వయంగా నిత్య బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. లారెన్స్ 'కాంచన 2' చిత్రంలో 'గంగ' క్యారెక్టర్ని నిత్యామీనన్ కు నెరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ను ఎలా చేయాలా అనే ఆలోచనలలో నిత్య ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుందట.
లారెన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది నిత్యా.
అయితే సెట్స్ మీదకు వెళ్ళిన తరువాత ఆ గంగ పాత్రను చేసేయవచ్చు అన్న మొండి ధైర్యంతో ఒప్పుకున్నాక ఈ సినిమా చేసినప్పుడు తాను పడ్డ హింస ఇంతవరకు ఏ చిత్రానికి పడి ఉండనని, తను ఇంతవరకు నేర్చుకున్నది అంటూ ఏదైనా ఉంటే అది ఈ సినిమానుంచే అని నిత్యామీనన్ చెప్పింది. అంతేకాదు షూటింగ్ స్పాట్ లో లారెన్స్ రాక్షసుడిగా మారిపోయి తన నుండి నటనను రాబట్టడానికి వరస పెట్టి టేక్స్ తీస్తూ ఉంటే తాను ఈ సినిమాలో నటించడానికి ఎందుకు ఒప్పుకున్నానా అని బాధ పడ్డానని మణిరత్నం లాంటి దర్శకుడు వద్ద తనకు ఇటువంటి టార్చర్ ఎదురు కాలేదని లారెన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది నిత్యా.
కాంచన- 2’గా 10రోజుల క్రితం
ఇక ఈ వార్తలు ఇలా ఉండగా కాంచన- 2’గా 10రోజుల క్రితం తమిళoలో విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈసినిమాను అనుకున్న సమయానికి బెల్లంకొండ సురేష్ విడుదల చేయగలిగి ఉంటే అతడి ఆర్ధిక సమస్యలు అన్నీ తీరిపోయి ఉండేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫైనాన్స్ సమస్యలతో ‘గంగ’ ఆగిన విషయం తెలిసిందే. ఈ మూవీని మే 1న ఎలాగైనా విడుదల చేయాలని పీవీపీ ప్రసాద్, దిల్రాజు, సి.కళ్యాణ్ లాంటి నిర్మాతలు పోటీ పడుతూ ఉండటంతో ఒక డబ్బింగ్ సినిమా పై ఇంత క్రేజ్ ఉందా అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈమధ్యనే రిలీజ్ అయిన ‘ఓకే బంగారం’ సూపర్ హిట్ కావడంతో త్వరలో రాబోతున్న ‘ఉత్తమ విలన్’, ‘గంగ’, ‘ఎంతవాడు గానీ’ సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ సమ్మర్ సీజన్ కు రాబోతున్న టాప్ హీరోల భారీ సినిమాలకు కష్ట కాలం అని టాక్..