ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా మూవీ షూటింగ్ ని పూర్తి చేయగల దర్శకులలో టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పేరు మొదటగా వినిపిస్తుంది. ఎంత పెద్ద కాస్టింగ్ మూవీ అయినా సరే, తను అనుకున్న డేట్ లోనే మూవీని పూర్తి చేయటం అందులోనూ తక్కువ రోజుల్లోనే పూర్తి చేయటం పూరీ స్టైల్.

ఆ విధంగానే ప్రస్తుతం చార్మి మూవీని సైతం ఎప్పుడు మొదలైందో పూర్తిగా తెలుసుకునేలోపు, మూవీ షూటింగ్ ని పూర్తి చేసేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొదటి సారి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జ్యోతి లక్ష్మీ’. చార్మింగ్ గర్ల్ ఛార్మీ టైటిల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ని పూరి జగన్నాధ్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసాడు.

ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది ఫిబ్రవరి 20న, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది, రేపటితో అనగా ఏప్రిల్ 29తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. రేపటితో అన్ని సీన్స్ ని ఫినిష్ చేసి గుమ్మడి కాయ కొట్టేయనున్నారు.

ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని గోవాలో షూట్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేసి మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: