టాలీవుడ్ లో సెలబ్రెటీలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం పరిపాటే అయ్యింది. మొన్నటికి మొన్న బెల్లం కొండ సురేష్ కారు యాక్సిండెంట్ కేసు మరువక ముందే నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు . ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న నిర్మాత కళ్యాణ్ తాజాగా ఓ మహిళా డాక్టర్ పై చేయి చేసుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సి.కల్యాణ్ తనపై చేయి చేసుకున్నారంటూ కవిత అనే ఓ మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సి. కల్యాణ్, డాక్టర్ కవిత ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో వీరిద్దరికి వివాదం జరిగింది.


నిర్మాత సి.కళ్యాన్


మెట్రో నష్టపరిహారం మొత్తం అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కే ఇవ్వాలని సి.కళ్యాణ్‌ ఒత్తిడి తెస్తున్నాడని డాక్టర్‌ కవిత అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఫ్లాట్‌ను తనకే అమ్మాలని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 5లో గల ఓ ఫ్లాట్‌ విషయంలో గత కొద్దిరోజులుగా డాక్టర్‌ కవిత, సి.కళ్యాణ్‌ మధ్య వివాదం నెలకొంది. ఆఫ్లాట్‌ మార్గంలో మెట్రోరైలు వెళ్తున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌ కొంత మేరకు పోయే అవకాశం ఉంది, అందుకు జీహెచ్‌ఎంసీ పరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే వచ్చే నగదును వ్యక్తిగతంగా కాకుండా ఫ్లాట్‌ఓనర్స్‌ అసోసియేషన్‌లో వేయమని సి.కళ్యాణ్‌ కోరగా, అందరికి వేరువేరుగా ఇవ్వాలని కవితతో పాటు మరో ఐదుగురు కోరారు.  అంతేకాకుండా కవితకు సంబంధించిన ఫ్లాట్‌ను కూడా తనకే అమ్మాలంటూసి.కళ్యాణ్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో కవిత జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో సి.కళ్యాణ్‌పై 506, 509, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: