తారా చౌదరి ఈ పేరు వింటుంటే గతంలో మీడియా చానల్ ముందు ఎన్నో సార్లు హల్ చల్ చేసిన వార్తల్లోకి ఎక్కింది. కొంతకాలం తర్వాత తారా చౌదరి పేరే మర్చిపోయాం. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది తార. హైదరాబాదులోని ఇందిరానగర్‌లో గల ఆమె నివాసంలో గత రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈమె ఇంట్లో పనిచేసే వ్యక్తి దుర్గా ప్రసాద్ కి సందీప్, రాజేష్,ఉదయ్ అనే వ్యక్తులకు తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి.


తారా చౌదరి 


ఈ దాడిలో దుర్గ ప్రసాద్ ని ముగ్గురు యువకులు చితకబాదారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే, తామేమీ దుర్గా ప్రసాదుపై దాడి చేయలేదనీ, దుర్గా ప్రసాద్ తనను వేధిస్తున్నాడని ఆమె ఫోన్ చేస్తేనే తాము అక్కడికి వెళ్లినట్లు ఆ కుర్రాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. తాము ఆదుకుందామని వెళితే... తారా చౌదరి ప్లేటు ఫిరాయించి తమపై రివర్స్ గా కేసు పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో అసలు విషయం తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: