మొన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక ప్రాంగణంలో జరిగిన ‘పండగ చేస్కో’ ఆడియో ఫంక్షన్ లో రకుల్ ప్రీత్ బ్యాక్ పార్ట్ ఎక్స్ పోజింగ్ కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ‘పండగ చేస్కో’ ఆడియో ఫంక్షన్ కు గులాబి రంగులో మెరిసిపోయే రకుల్ ప్రీత్ పింక్ కలర్ పొడవాటి గౌనులో వచ్చిన రకుల్ ప్రీత్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

తన కారులోంచి దేవకన్యలా మెరిసిపోతూ దిగిన రకుల్ ప్రీత్ పొడవాటి పింక్ కలర్ గౌన్ రెట్టింపు అందాన్ని తీసుకొచ్చింది. బ్యాక్ పార్ట్ అంతా హాఫ్ వరకూ ఓపెన్ గా కనిపించడంతో రకుల్ వీపు వెన్నెల సముద్రoలా మిళమిళలాడుతోంది అన్న కామెంట్లు వినిపించాయి. మామూలుగానే ఆ ఫంక్షన్‌కి రకుల్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయితే  ఈ గౌను పుణ్యమా అని ఆమె డబుల్ ఎట్రాక్షన్ అయింది.

ఇంతకీ ఆ గౌను ఖరీదు 70 వేల రూపాయలు అని తెలిసి చాలామంది ఆశ్చర్య పోయారు. అంతేకాదు రకుల్ తన వీపు చూపించడానికి 70 వేలు ఖర్చుపెట్టింది అంటూ కొంతమంది సెటైర్లు కూడా వేసారు. అయితే ఈ విషయమై రకుల్ స్పందన వేరుగా ఉంది. ఈ ఫంక్షన్ కు రకుల్ చీర కట్టుకుని రావాలి అని భావించిందట. కానీ రకుల్  పర్సనల్ స్టయిలిస్ట్ కోన నీరజ  ఓ పొడవాటి  గౌను ఫొటో పంపించి, ఇది బాగుంటుంది అని చెప్పిందట. 

బ్యాక్ మరీ ఇంత ఓపెన్‌గా ఉంటే బాగుంటుందో? లేదో? అని రకుల్ భయపడినా కోన నీరజ  కన్విన్స్ చేసి, గౌరీ అండ్ నైనికాతో ఈ గౌను డిజైన్ చేయించింది అని రకుల్ చెపుతోంది. భయపడుతూనే ఆ గౌను వేసుకున్నా తీరా ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళాక బోల్డన్ని కాంప్లిమెంట్స్ చాలా మంది ఫోన్ చేసి మరీ అభినందించారు అని చెపుతోంది రకుల్ ప్రీత్. ఏది ఏమైనా రకుల్ ప్రీత్ పింక్ కలర్ పొడవాటి గౌన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్..
 




మరింత సమాచారం తెలుసుకోండి: