కోలీవుడ్ బ్యూటీ త్రిష ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ప్రభాస్ లపై కామెంట్స్ చేయడమే కాకుండా అనేకమంది ప్రముఖ దర్శకుల ప్రతిభ పై ట్యాగ్ లు ఇచ్చింది. తాను సినిమా రంగానికి వచ్చినప్పుడు కేవలం ముగ్గురు నలుగురు హీరోయిన్స్ మధ్య మాత్రమే పోటీ ఉండేదని అయితే నేడు ఆ పోటీ దాదాపు 10 నుంచి 15 మంది హీరోయిన్స్ మధ్య పోటీగా మారడంతో ప్రస్తుతం హీరోయిన్స్ లైఫే స్పాన్ బాగా తగ్గి పోయింది అని కామెంట్స్ చేసింది త్రిష.

హీరోలు స్టార్స్ గా ఎదిగిపోయాక వారిలో అహం పెరిగిపోతుందని అయితే తాను బాలకృష్ణతో ‘లయన్’ సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఇంతకాలం ఇటువంటి మంచి వ్యక్తితో ఎందుకు నటించలేకపోయానా అని చాలాసార్లు బాధ పడ్డానని కామెంట్స్ చేసింది త్రిష. సెట్స్ పై సరదాగా ఉండే బాలయ్య షూటింగ్ అయిపోగానే చాల కూల్ గా ఎదుటి మనిషిని గౌరవిస్తూ మాట్లాడే బాలకృష్ణను చూస్తే 100 సినిమాలకు దగ్గరలో ఉన్న హీరోలో ఇంత సంస్కారం ఉంటుందా అని తనకు అనిపించిందని కామెంట్స్ చేసింది త్రిష.

ఇక ప్రభాస్ ఒక చిన్ననాటి స్నేహితుడిలా ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడని ప్రభాస్ తో కలిసి నటిస్తున్నప్పుడు టైమ్ తెలియదు అని కామెంట్స్ చేసింది త్రిష. ఇదే సందర్భంలో తన పెళ్ళి గురించి వస్తున్న వార్తల పై స్పందిస్తూ తన వ్యక్తిగత విషయాల పై మీడియా ఎందుకు అంత విపరీతమైన శ్రద్ద తీసుకుంటుందో తనకు అర్ధం కాని విషయమని మీడియా పై సెటైర్లు వేసింది త్రిష.

ఐదు రోజులు తరువాత తాను ఏమిచేస్తానో తనకే తెలియదు అనీ తాను ఏదీ పెద్దగా ఆలోచించుకుని కెరియర్ ను ప్లాన్ చేసుకోనని అంటూ జిమ్స్ చుట్టూ తిరిగే కన్నా సూర్య నమస్కారాలు పవర్ యోగా చేస్తే గ్లామర్ దానంతట అదే వస్తుందని తన గ్లామర్ సీక్రెట్ ను చెప్పిన త్రిష అనుష్క లాంటి హీరోయిన్ ప్రస్తుతం దక్షిణ భారత సినిమా రంగంలో ఎవరూ లేరు అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. హాయిగా బతుకు ఇతరులను బతకనివ్వు అన్న త్రిష సిద్దాంతం నేటి తరం హీరోయిన్స్ కు నచ్చుతుందేమో చూడాలి..







మరింత సమాచారం తెలుసుకోండి: