బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కి కోపం వచ్చింది. సాధారణంగా అమితాబచ్చన్ మృధు స్వభావి. కోపం అంటే ఆయనకు అస్సలు తెలియదు. ముఖంపై చిరు నవ్వుతో ఏన్నో కార్యక్రమాలు చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి బాగా పాపులర్ అయ్యాడు. మరి ఆయనకు అంతగా కోపం వచ్చే విషయం ఏమిటబ్బా అనుకుంటున్నారా..? ఈ మధ్య నెపాల్ లో జరిగిన భూకంపం ఉదంతం అందరికీ తెలుసు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మరెంతో మంది క్షతగాత్రులు అయ్యారు. ఉండటానికి గూడు లేకుండా అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. వారిని చూస్తుంటే ఎవరి హృదయమైనా కరిగిపోతుంది. మరి అలాంటి భూకంప బాధితుల్ని పక్క దేశమైన మన భారత దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


నేపాల్ భూకంప బాధితులు


అయితే అమితాబ్ విజ్ఞప్తిపై కొందరు సెటైర్లు విసిరారు. ఏదో ఆశించి అమితాబ్ ఇలా చేస్తున్నారని కొందరు నెటిజన్లు బిగ్ బీ ని విమర్శించారు.  తాను ఇప్పడు ఆర్ధికంగా బాగానే ఉన్నానని కష్టాల్లో ఉన్న వారిగురించి మాట్లాడితే కనీసం భాద్యత లేకుండా అనాలోచితంగా ఆలోచిస్తారా అంటూ నెటిజెన్ల కామెంట్స్ పై బిగ్ బీ కి విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయం పై తీవ్రంగా స్పందిచిన బిగ్ బీ ఎలాంటి ప్రచారం కోసం ఇలా చేయలేదని పేర్కొన్నారు. అటువంటి కామెంట్స్ చేసేవారు తమ ప్రవర్తనలో మార్పు రావాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: