గతంలో టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన డైరెక్టర్, ఇప్పుడు వారిచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ రాఘవ లారెన్స్ చేసిన సినిమా సీక్వెల్ ప్రాంచైజ్ ముని. ముని,కాంచనల తర్వాత వీటికి కొనసాగింపుగా రాఘవ లారెన్స్ చేసిన సినిమా ‘గంగ’. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.

గత సీక్వెల్స్ లానే ఈ సినిమా కూడా భయపెడుతూ, నవ్విస్తూ మాస్ ప్రేక్షకులచేత కలెక్షన్స్ కురిపిస్తోంది. మొదటి రోజు సుమారు 3.55 కోట్లు కలెక్ట్ చేయటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా అవాక్కయింది. ఎందుకంటే రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన గంగ మూవీ, కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ కాదనేది ఇండస్ట్రీ రిపోర్ట్. కానీ ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి.

ముఖ్యంగా కాంచన సినిమా క్రేజ్ వల్ల ‘గంగ’ సినిమా కృష్ణా జిల్లాలో స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మొదటి రోజు సుమారు 29 లక్షల షేర్ క్రాస్ చేసిన ఈ సినిమా గంగ, రెండవ రోజు కూడా సుమారు17 లక్షల షేర్ సాధించింది. మొత్తంగా మొదటి రోజుల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46 లక్షల షేర్ కలెక్ట్ చేసారు. ప్రసతుతం సమ్మర్ సీజన్ కావడం వలన ఈ సినిమా ఓవరాల్ గా ఒక కోటి నుంచి 1.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మిగిలిన ఏరియాల్లో కూడా మొదటి రెండు రోజులు కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. గతంలో లారెన్స్ డైరెక్టర్ చేసిన తెలుగు సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు గంగ మూవీ కూడ అదే పరిస్థితి అనుకున్న ప్రొడ్యూజర్స్ కి డైరెక్టర్ గట్టిగానే సమాధానం చెప్పాడని అంటున్నారంట.


మరింత సమాచారం తెలుసుకోండి: