ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారంతో నయనతార కేరీర్ అంతమైపోతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఆ లవ్ స్టోరీ షూటింగ్ ప్యాకప్ చెప్పేశాక.. ఈ ముదురు ముద్గుగుమ్మ కేరీర్ బాగానే గాడిలో పడింది. తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 
మళ్లీ తెలుగువైపు నయన చూపు


కుర్రహీరీలతోనూ పోటీపడి నటిస్తున్న నయనతార.. ఇటీవలి కాలంలో తెలుగువైపు చూడనేలేదు. గ్రీకువీరుడు, అనామిక తర్వాత మళ్లీ ఇటువైపు చూడనేలేదు. ఐతే మళ్లీ ఈ అమ్మడి దృష్టి తెలుగుపై పడినట్టుందని టాక్స్ వినిపిస్తున్నాయి. 
డిక్టేటర్ తో నయనతార


ఫ్లాప్ తో తెలుగు ఇండస్ట్రీని వదిలేసిన ఈ అమ్మడి ఈసారి మాంచి హిట్ కొట్టాలని చూస్తోందట. బాలయ్యతో సింహా తరపున అదరగొట్టిన ఈ అమ్మడినే  బాలయ్య తదుపరి చిత్రం డిక్టేటర్ లో నటింపజేయాలని అనుకుంటున్నారట. 
రిపీట్ కానున్న లక్ష్మీజోడీ


లక్ష్మీ సినిమాతో నయనతో మాంచి హిట్ కొట్టిన వెంకీ కూడా తన తదుపరి చిత్రంలో నయనతారే కావాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే కుర్రహీరో గోపీచంద్ తోనూ నయన ఓ సినిమాలో బుక్కైందట. ఇంకేం తెలుగు ప్రేక్షకులకు మళ్లీ ముదురు అందాల ఆరబోత రెడీ అన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: