పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖుషీ ముఖర్జీ ప్రస్తుతం ఆకాష్ తో ‘దొంగ ప్రేమ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఆమె ఒక్కసారిగా మీడియా హాట్ న్యూస్ లోకి రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం భోపాల్ లోని ఒక ప్రముఖ హోటల్ లో ఉన్నప్పుడు ఒక మైనర్ ఏజ్ కుర్రాడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని, పలుచోట్ల తను నిద్రపోతున్నప్పుడు టచ్ చేసాడని ఆమె ఆరోపించింది.


అంతేకాదు ఈ వ్యవహారం మొత్తం టీవీ ఛానెల్ కు కూడ ఎక్కింది. ఈ వార్తలను ఒక ప్రముఖ ఛానల్ చాల ప్రముఖంగా ప్రసారం చేసింది. ఖుషీ ముఖర్జీ తెలుపుతున్న వివరాల ప్రకారం భోపాల్ లోని అమర్ విలాస్ అనే హోటల్ లో తాను దిగినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఆమె చెపుతోంది.


ఈ విషయమై ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే


తాను గత శుక్రువారం మూడు గంటల ప్రాంతంలో తన హోటల్ రూమ్ లో నిద్రపోతున్న సమయంలో ఆ హోటల్ కు చెందిన బాయ్ గదిలోకి అక్రమంగా ప్రవేశించి తనతో ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తూ టచ్ చేయరాని చోట్ల టచ్ చేసాడని అంటోంది. ఈ విషయమై ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా జాతీయ మహిళా కమీషన్ దృష్టికి కూడ ఈ విషయాన్ని తీసుకు వెళతానని ఆమె చెపుతోంది.


అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్  వర్షన్ వేరే విధంగా ఉంది. ఈ వ్యవహారాన్ని అంతా పబ్లిసిటీ కోసం ఖుషీ ముఖర్జీ చేస్తోందని ఆమె పూర్తిగా తాగి తాను దిగిన హోటల్ రూమ్ లోని నెల పై పడుకుని ఉన్నప్పుడు ఆ మైనర్ హోటల్ బాయ్ ఆమెను తన హోటల్ రూమ్ బెడ్ పై పడుకోమని చెప్పినప్పుడు అతడితో ఘర్షణకు దిగి ఇంత వ్యవహారాన్ని ఖుషీ ముఖర్జీ నడిపింది అని హోటల్ మేనేజ్మెంట్ వర్గాల వాదన. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం ఖుషీ ముఖర్జీ మీడియాకు హాట్ టాపిక్ గా నిలిచింది..








మరింత సమాచారం తెలుసుకోండి: