ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఊపు మీద ఉన్న యాక్టర్ సందీప్ కిషన్. సందీప్ కిషన్ చేస్తున్న మూవీలు అన్నీ బాక్సాపీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తను నటిస్తున్న టైగర్ మూవీ అనంతరం, సందీప్ డబుల్ యాక్షన్ రోల్ లో కనిపించే అవకాశం ఉందంటున్నారు. అయితే తాజాగా టైగర్ మూవీకి సంబంధించిన ఆడియో విడుదలైంది.

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే నెల రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్ మాస్, ఎనర్జిటిక్ పాత్రలో నటించాడని, తమన్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.

చిత్ర సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ, పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో అత్యున్నత సాంకేతిక విలువలు ఉన్నాయని, సందీప్‌కిషన్ కెరీర్‌ను మరోస్థాయికి తీసుకువెళ్ళేలా ఉంటుందని, అన్ని వర్గాలవారు చూడదగ్గ చిత్రంగా రూపొందిందని, త్వరలో అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

సీరత్‌కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీవిశ్వనాధ్, పృధ్వీరాజ్, ఇతర పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే సందీప్ మాత్రం తన చేయబోయే డబుల్ రోల్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజిగా వర్క్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: