బాహుబలి సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్‌ పోస్టర్‌ను మేడే సందర్భంగా విడుదల చేశారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, రాజమౌళి బ్రాండ్‌ నేమ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా మరో పోస్టర్‌ రిలీజ్ అయింది. ఇందులో ప్రభాస్ శివలింగాన్ని మోసుకువస్తు ఉండటం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రభాస్‌ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలిభాగాన్ని బాహుబలి ది బిగినింగ్‌గా పిలుస్తున్నారు. ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్‌, రమ్య కృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. మే 15న విడుదల చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ పోస్ట్ పోడక్షన్‌ పనులు.. విజువల్‌ గ్రాఫిక్స్ మరింత ఆలస్యం కావడంతో చిత్రాన్ని జూన్‌ చివరి వారంలో లేదా జూలైలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మే 31న సినిమాకు సంబంధించిన అఫీషియల్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్‌ కావడం ఇష్టం లేకనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్‌ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. మరి బాహుబలి ది బిగినింగ్‌ సెకండ్ పోస్టర్‌పై మీరూ ఓ లుక్కేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి: