తెలుగు,తమిళ,హిందీ సినిమాల్లో అతిలోక సుందరిగా కీర్తింప బడిన అందాల నటి శ్రీదేవి. ఎనబైవ దశకంలో మూడు భాషల్లో నటించి ప్రజల మెప్పు పొందింది. అంతే కాదు అన్ని భాషల్లో అగ్ర హీరోల సరసన నటించిన శ్రీదేవికి బాలీవుడ్ లో స్థిరపడి పోయింది. బోనికపూర్ పెళ్లి అయిన కొంత కాలం సినిమాల్లోకి రాలేదు. ఇప్పడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అంతే కాదు తన పెద్ద కూతురు జాహ్నవి ని కూడా వెండితెరకు పరిచయం చేయాలని ఆలోచనలో ఉంది.
కుటుంబ సభ్యులతో శ్రీదేవి
శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి ఆంధ్రాకు వచ్చింది. ఇప్పటికే జాహ్నవి హీరోయిన్గా పరిచయం కాబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు తెలుగు లో ఒక్క ఊపు ఊపిన శ్రీదేవి తన కూతుర్ని కూడా తెలుగు ఇండస్ట్రీలోనే అరంగెట్రం చేయించాలనకుటుందా అని ఊహాగానాలకి తెరలేపుతుంది. అయితే శ్రీదేవితో కలిసి జాహ్నవి ఇక్కడికి వచ్చింది సినిమా చర్చల కోసమైతే కాదట. శ్రీకాళహస్తిలో కూతురి పేరు మీద ఏవో పూజలు చేయించిందట. జాహ్నవి ఆరోగ్యం కోసం, ఆమె భవిష్యత్తు కోసమని శ్రీదేవి సర్పదోష యాగం చేయించినట్టు సమాచారం.