తారా చౌదరీ ఈ పేరు వింటేనే సంచలనాలకు నాంధీ అని తెలుస్తుంది. అయితే మొన్నామధ్య ఈమె ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. దీంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది ఈ అమ్మడు. గతంలో పొలిటీషన్స్,సినీ ఇండస్ట్రీ, వ్యాపార వేత్తలను ముప్పతిప్పలు పెట్టింది. తన దగ్గరకు వచ్చి వారు చేసిన రాసలీలలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుందని ఈమెపై కొందరు కేసు వేశారు. సరే ఇవన్నీ గతం.. ఇప్పుడు తారా చౌదరి గత ఏడేళ్లుగా తనకు జరిగిన అన్యాయాలపై సినిమా తీస్తుందట.


సినీనటి తారా చౌదరి


అంతే కాదు ఈ సినిమా తనే స్వయంగా నిర్మిస్తుందట.  త్వ్వరలో తనకు జరిగిన విషయాలను కథగా చేర్చి సినిమా తీస్తానని అది నేనే నిర్మిస్తానని అంటోంది . గత ఏడేళ్ళుగా సినిమా నిర్మాణం అంటూ ఓ బ్యానర్ పెట్టిందే తప్ప ఇంతవరకు ఒక్క సినిమా కూడా నిర్మించలేదు . అయితే ఇప్పుడు మాత్రం ముందు ఒక పెద్ద సినిమా తీసి ఆ తర్వాత నా కథ ని సినిమా గా తీస్తానని అంటోంది . చూద్దాం  ఏమౌతుందో . 


మరింత సమాచారం తెలుసుకోండి: