ప్రముఖ దర్శకులు మణిరత్నం గుండె పోటుకు గురయ్యారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఈ రోజు ఉదయం జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.  కానీ  ఈ వార్తలు అవాస్తవమని ఆయన సతీమణి సుహాసిని అంటున్నారు.  కేవలం మణిరత్నం హెల్త్ చెకప్ కోసమే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు. తాను మణిరత్నం  ఢిల్లీలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చామని అదే విధంగా సాధారణ పరీక్షల్లో భాగంగా హెల్త్ చెకప్ చేయించుకున్నారు అని చెప్పారు. చెన్నైలో చికిత్స తీసుకుంటే రక రకాలుగా పుకార్లు వస్తాయనే ఉద్దేశంతో ఢిల్లీలో చికిత్స తీయించుకోవడానికి వచ్చామని కానీ ఇప్పడు కూడా పుకార్లు షికార్లు చేశాయని ఆమో వాపోయారు. కాగా మణిరత్నం కి   2004, 2009 లో యువ, రావణ్ చిత్రాలు తీసే సమయంలో మణిరత్నంకు హార్ట్ ఎటాక్ వచ్చిందట. 


సుహాసిని ట్విట్


మరింత సమాచారం తెలుసుకోండి: