రజినీకాంత్ అంటే తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలో ఓ అద్భతమైన నటుడు. ముఖ్యంగా తమిళ నాట ఆయన సినీ అభిమానులకు దేవుడే అని చెప్పాలి. తమిళ నాట ఈయన అంటే పడిచచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు రజినీ చిత్రాలు ప్రపంచ స్థాయిలో మంచి పేరు కూడా సంపాదించాయి. ముఖ్యంగా జపాన్, చైనా, సింగపూర్ లాంటి దేశాల్లో ఈయన అభిమానులు కూడా ఉన్నారు. అయితే రజినీకాంత్ కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. కూతురు తీసిన సినిమా కొచ్చాడయాన్, తర్వాత వచ్చిన లింగ చాలా ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో రజిని తదుపరి చిత్రం ఏమిటా అని అందరూ అనుకుంటున్నారు.


కూతురు సౌందర్య, మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రహమాన్ తో రజినీకాంత్


చాలామంది ఊహించినట్లుగా ఆయన కేయస్ రవికుమార్ తోనో, శంకర్ తోనో.. ఇలా పెద్ద దర్శకులతో సినిమా చేయడంలేదు. కేవలం రెండే రెండు చిత్రాల అనుభవం ఉన్న రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రజనీకాంత్ పచ్చజెండా ఊపారు. అగ్ర నిర్మాత కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: