కోలీవుడ్ టాప్ హీరో సుర్యాను అభిమానించే వారు మన తెలుగు ప్రేక్షకులలో కూడ చాలామంది ఉన్నారు. రజినీకాంత్ కమలహాసన్ ల తరువాత టాలీవుడ్ లో టాప్ హీరో స్టేటస్ సూర్య సొంతం. త్వరలో విడుదల కాబోతున్న తన ‘రాక్షసుడు’ సినిమా విశేషాలను మీడియాకు తెలియ చేస్తూ సెలెబ్రెటీస్ స్టేటస్ పై ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

సినిమా తారల జీవితం ఇమేజ్ అంతా ఒక నీటి బుడగ లాంటిదని ఈ రంగంలో విజయం సాధించిన తారలు అంతా అది తమ ప్రతిభ వల్ల వచ్చింది అనుకుంటే పొరపాటు అంటూ వ్యాఖ్యలు చేసాడు. కోట్లమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ సెలెబ్రెటీ స్టేటస్ కేవలం ఎదో ఒక అదృష్టం వలన వచ్చిందని అంటూ ఈ పేరు ప్రతిష్టలు డబ్బు అంతా మనకు తెలియని ఒక అతీత శక్తి ఆశీర్వాదం వల్ల లభించాయని వేదాంతపరమైన కామెంట్స్ చేసాడు సూర్య. 

గతంలో ప్రతి ఐదేళ్ళకు ప్రేక్షకుల అభిరుచులలో మార్పులు వచ్చేవనీ అయితే ప్రస్తుతం మారిపోతున్న పరిస్థుతులలో ప్రతి సంవత్సరం ప్రేక్షకుల అభిప్రాయాలలో మార్పులు వస్తూ ఉండటంతో ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఏమిటో తెలియక టాప్ హీరోలు కూడా ఎటువంటి సినిమాలలో నటించాలో తెలియక అయోమయంలో పడిపోతున్నాము  అంటూ కామెంట్ చేసాడు సూర్య.

ఇప్పటి జనరేషన్ అంతా ‘టీ – 20’ జనరేషన్ గా మారిపోయింది అని చెపుతూ జీవితంలో ప్రతి ఎమోషన్ ఒక్క సెకన్ లో అలా వచ్చి అలా వెళ్ళి పోవాలి అనుకుంటూ జీవితాలను బుల్లితెర పై చూసే యాడ్ ఫిలిమ్స్ లా నేటి యువత భావిస్తోందని దాని ప్రభావమే సినిమాల పై పడింది అంటూ కామెంట్స్ చేసాడు సూర్య.. 



మరింత సమాచారం తెలుసుకోండి: