‘శివాజీని ఓ చూపు చూద్దామని ఎవరైనా అనుకుంటే తాను పోతూపోతూ మీలో ఎవరో ఒకరిని వెంట తీసుకుపోతాను’ అంటూ హీరో శివాజీ నిన్న సాయంత్రం విజయవాడలో చేసిన కామెంట్స్ మీడియా కు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు సంబంధించిన  విషయం పై నిన్న విజయవాడలో కరపత్రం విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు శివాజీ. 

అంతేకాదు మంత్రులందరికి ఓ నెల రోజుల టైమ్ ఇస్తున్నానని  ఆలోగా కూడా మంత్రులు స్పందిచకపోతే వారి ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ఖాయం అంటూ శివాజీ మళ్ళీ తన గళాన్ని పెంచాడు. పోలవరం మనకు జీవనాధారంఅని అంటూ  ఇన్నేళ్లయినప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తికాకపోవడం దురదృష్టకరం అని కామెంట్ చేసాడు శివాజీ. ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక సంఘానికి చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తన దృష్టిలో అది ఓ చెత్త సంఘం లాంటిదని శివాజీ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై కేసులున్నాయని ఆయన్ని బెదిరిస్తున్నారు అనింటూ అదేవిధంగా చంద్రబాబును కూడ బెదిరిస్తున్నారని అయితే వారు భయపడకుండా ఉద్యమాలు చేస్తే ప్రజలు వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ శివాజీ కామెంట్స్ చేసాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా  విషయాన్ని సింపుల్‌గా తీసుకునేవారిని తన  దృష్టిలో సిల్లీ ఫెలో అని అనుకోవాల్సి వస్తుందని అంటూ తనను  పిచ్చోడనుకున్నా పర్వాలేదు కానీ తానూ తన  పోరాటాన్ని మాత్రం ఆపనని తేల్చిచెప్పాడు శివాజీ.  

ఓ చిన్న ఫ్లై ఓవర్ ప్రాజెక్టుని కూడా సకాలంలో పూర్తి చేయలేని వాళ్ళు సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని అంటున్నారని శివాజీ నేటి నాయకులపై సెటైర్లు వేసాడు. అయితే ఇన్నిమాటలు చెప్పిన శివాజీ తనను ఒక చూపు చూస్తోంది ఎవరు అన్న విషయం పై స్పష్టత లేకుండా మాట్లాడి శివాజీ ప్రత్యేక హోదా విషయమై మండుతున్న వేసవిలో మరింత హాట్ కామెంట్స్ చేసాడు. కొసమెరుపు ఏమిటంటే ఈసారి శివాజీ మాటలలో పవన్ ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరం..



మరింత సమాచారం తెలుసుకోండి: