శ్రీసాయిశంకర ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయి సునీల్‌ నిమ్మలను దర్శకుడిగా పరిచయం చేస్తూ వడ్డే మల్లేష్‌`ధృవ్‌ తాండే సంయుక్తంగా నిర్మిస్తున్న క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పారాహుషార్‌’. ‘బి ఎలర్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. విజయ్‌ తాండేల్‌, సూర్యచంద్ర, శ్రీవినోద్‌, సుమ, నందితా మండల్‌, కీర్తి ప్రకాష్‌ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.


పారాహుషార్‌ లో దృశ్యం


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల మాట్లాడుతూ... ‘నాపై నమ్మకంతో మా మల్లేష్‌గారు ఈ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించగా, నా కథపై నమ్మకంతో మా చిత్ర కథానాయకుడు విజయ్‌ తాండేల్‌ సోదరుడు ధృవ్‌ తాండేల్‌ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారడం చాలా సంతోషంగా ఉంది. వైవిధ్యమైన కథనంతో యువతను మెప్పించే విధంగా ‘పారాహుషార్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. మర్డర్‌ మిస్టరీ నేపధ్యంలో సాగే క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆడియన్స్‌ను స్పెల్‌బౌండ్‌ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. మూడు
షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు నన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.


పారాహుషార్‌ సినిమాలో స్టిల్


ఈ చిత్రానికి సంగీతం: చిన్నిచరణ్‌`కిరణ్‌ వెన్న, కథ`సంభాషణలు: సి.భీమేశ్వరాచారి, పాటలు: కాసర్ల శ్యామ్‌, ఛాయాగ్రహణం: వై.వి.లక్ష్మీనారాయణ, నిర్మాతలు: వడ్డే మల్లేష్‌`ధృవ్‌ తాండేల్‌, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల!


మరింత సమాచారం తెలుసుకోండి: