మెగా అభిమానులకు త్వరలో ఓ శుభవార్త అందబోతుంది, మెగా మల్టీ స్టారర్ మరో చిత్రం రూపొంద బోతుంది. రాంచరణ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండబోతుందట, ఇక శ్రీను వైట్ల కామెడికి పెద్ద పీట అన్నట్టే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న బ్రూస్ లీ సినిమా షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. ఈ మరో వైపు అయన మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.


ఎవడు చిత్రం పోస్టర్


తండ్రి సినిమా నిర్మాణ బాధ్యతలు చెర్రీ చెపట్ట నున్నాడు కాబట్టి చరణ్ ఇప్పుడా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాడు. తర్వాత రామ్ చరణ్ తో కలిసి అల్లు అర్జున్ నటించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా గతంలో ‘ఎవడు’ సినిమలో ఇద్దరు కలిసి పక్క పక్కన నటించక పోయినా ఆ సినిమాలో ఇద్దరూ ఓ రేంజ్ లో యాక్ట్ చేశారు. అల్లు అర్జున్ నిడివి కొద్ది సేపే ఉన్నా చాలా పవర్ ఫుల్ గా యాక్ట్ చేశాడు.  ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఎవడు చిత్రం లో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. మల్లి వీరిద్దరి కలయికలో రూపొందే సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: