ఒకప్పుడు శంకర్ ని కోలీవుడ్ డైరెక్టర్ అంటేనే గుర్తుపట్టగలం. కాని ఇప్పుడు మాత్రం డైరెక్టర్ శంకర్ ఫిల్మ్అంటే సామాన్య సినీ ప్రేక్షకుడితో పాటు ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. అంతే కాకుండా ఇప్పుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఫిల్మ్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ శంకర్ పై కమల్ హాసన్ కసి తీర్చుకున్నాడనే న్యూస్ తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినపడుతుంది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, భారతీయుడు మూవీ 1996లో విడుదలైన ఈ సూపర్హిట్ సినిమా, శంకర్ అనే దర్శకుడిని స్టార్ డైరెక్టర్గా మార్చితే, తెలుగులో స్టార్ నిర్మాత అయిన ఏ.ఎమ్.రత్నంకు తమిళంలో ఓ సుస్థిర స్థానాన్ని తెచ్చిపెట్టింది. తన అద్భుతమైన నటనతో కమల్ హాసన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాలో స్పృషించిన అంశం సమాజంలో ఉన్నదే. సమాజంలో మాసిపోని లంచం, అవినీతిలను ఓ బలమైన కథతో తెరకెక్కించిన విధానం ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది.
భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందించడం విషయమై నిర్మాత ఏ. ఎమ్. రత్నం తన అభిప్రాయాలను తెలుపుతూ.. “భారతీయుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఈ మధ్యే ఈ విషయం గురించి శంకర్తో మాట్లాడా. ఆయన కూడా ఈ విషయం పట్ల చాలా ఆసక్తి కనబరిచారు. అయితే ఇదే సమయంలో ఆయన ‘రోబో 2′ సినిమా కోసం సిద్ధమవడంతో, ‘భారతీయుడు 2’ను కొన్నాళ్ళు పక్కనపెట్టా. ‘రోబో 2′ పూర్తవగానే ఈ సినిమా గురించి ఆలోచిస్తా. భారతీయుడుకి సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుంది” అని అన్నారు.
అయితే నిజానికి
ఏ.ఎమ్.రత్నం
చేత శంకర్ ని అడిగించింది
కమల్ హాసనే అని అంటున్నారు.
గతంలో కమల్,
శంకర్ ని
కలిసి భారతీయుడు2 మూవీ
రావాలని కోరగా, అందుకు
శంకర్ ఆసక్తి చూపించలేదంట.
ఎలాగైన శంకర్
ని ఒప్పించితీరుతానని కమల్
చెప్పినట్టు ఓ మీడియా ఇంటర్వ్యూలో
ఉంది. ప్రస్తుతం
శంకర్ భారతీయుడు సీక్వెల్
కి సిద్ధం కావడంతో, కమల్
కసి తీరబోతుందనే చెప్పాలి.