టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే చిరంజీవి 150వ మూవీకి సంబంధించిన వివరాలు ఒక్కొటిగా  బయటకు వస్తున్నాయో, అప్పటి నుండి టాలీవుడ్ లో మెగా సందడి మొదలైందనే చెప్పాలి. చిరు 150వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్న పూరీ జగన్నాధ్, ఓ విషయంలో చిరు మాటని సైతం లెక్క చేయలేదంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పూరి జగన్నాధ్ స్క్రిప్ట్ రాసే ప్రతి సారి ఎక్కువ టైం బ్యాంకాక్ లోని బీచ్ ఏరియాలో గడుపుతారు. ప్రతి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడానికి ముందు పూరి బ్యాంకాక్ వెళ్లి అక్కడ స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకొని వస్తాడు. ముఖ్యంగా ఆ బీచ్ లో కూర్చొని డైలాగ్ వెర్షన్ ని ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న 150వ సినిమా కోసం డైలాగ్స్ రాయడం కోసం బ్యాంకాక్ కి వెళ్ళాడు. గత కొద్ది రోజులుగా పూరి బ్యాంకాక్ లో చిరు సినిమా కోసం పవర్ఫుల్ డైలాగ్స్ రాస్తున్నాడు.

అయితే పూరీ జగన్నాధ్ ని బ్యాంకాక్ ని కాకుండా, ఈసారి మరో ప్లేస్ కి వెళ్ళమని పూరీని చిరు సజెస్ట్ చేశాడంట. అందుకు పూరీ ఏ మాత్రం ఒప్పుకోకపోవడమే కాకుండా, కచ్ఛితంగా బ్యాంకాక్ వెళ్ళి తీరాల్సిందే, అక్కడే అంతా సెట్ అవుతుంది అంటూ క్లారిటిగా చెప్పుకొచ్చాడంట.

బ్యాంకాక్ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా, నేను వినను సార్ అంటూ చిరు ముందు మరో పంచ్ డైలాగ్ వదిలాడంట పూరీ. అయితే చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఈ సినిమాని లాంచ్ చేయనున్నారు. ఇది కాకుండా పూరి డైరెక్ట్ చేసిన ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: