టాలీవుడ్ లవర్ బాయ్ గా ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిల అభిమానాన్ని పొందిన సిద్ధార్థ్ ప్రస్తుతం నడుస్తున్న యంగ్ హీరోల రేసులో బాగా వెనకపడి ఉన్నాడు. అయితే సిద్ధార్థ్ కు మాస్టర్ పీస్ గా నిలిచే ‘బొమ్మరిల్లు’ సినిమాను  మాత్రం  ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమా పేరు చెప్పగానే ఆ సినిమా క్లయిమాక్స్‌లో 'అంతా మీరే చేసారు నాన్నా' అంటూ సిద్ధార్థ్‌ తన తండ్రి ప్రకాష్ రాజ్ వద్ద డైలాగ్స్ చెప్పే భారీ సీన్ గుర్తుకు వస్తుంది.

ఆ సినిమా విజయంలో ఆ సీన్ కు విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. అయితే అదే సీన్ ను ఆ తరువాత చాల సినిమాలలో ప్యారడీ చేసారు. ఇప్పుడు కూడ నాని అటువంటి ప్రయోగం చేసాడా అనే వార్తలు వస్తున్నాయి. మారుతి దర్సకత్వంలో నాని నటిస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమా క్లైమాక్స్ లో నాని 8 పేజీల సీన్ కు సంబంధించి తాను చెప్పే డైలాగ్స్ సింగిల్ టెక్ లో చెప్పి దర్శకుడు మారుతిని ఆశ్చర్య పరిచాడట. 

ఈ సీన్ ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న అల్లుఅరవింద్ కు కూడ బాగా నచ్చింది ఆని టాక్. ఈ సీన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో సంచలనాలకు సెటైర్లకు చిరునామాగా ఉండే మారుతి ఈ భారీ సీన్ ను ‘బొమ్మరిల్లు’ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కు సెటైర్ గా మార్చాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఎటువంటి బూతులు లేకుండా మారుతి చాల క్లీన్ గా ఈ సినిమాను తీసాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ ఆకర్షిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా అయినా తనకు కోరకున్న హిట్ ను అందిస్తుంది అన్న ఆశతో నాని ఉన్నాడు అని టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: