షాకింగ్ న్యూస్ తమిళ హీరో సూర్య నటించిన రాక్షసుడు కువైట్ లో బ్యాన్ చేశారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి నిర్మాతలు, ఈ మధ్య ఈ సినిమా ఆడియో వేడుకలు ఘనంగా జరిగాయి. అంతే కాదు ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు కువైట్ దెబ్బ పడింది కారణం అక్కడ వారి మత విశ్వాసాలు దెబ్బతినేలా సినిమా సన్నివేశాలు ఉన్నాయంట.


రాక్షసుడు ఆడియో ఫంక్షన్లో సూర్య, ప్రభాస్


విషయానికి వస్తే.. సినిమాలో హీరోకు సూపర్ పవర్స్ ఉన్నాయని అది తమ మత విశ్వాశాలకు విరుద్దమని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇస్లామిక్ కంట్రీ అయిన కువైట్   తమ దేశ మత విశ్వాసాలను గౌరవిస్తుంది. భగవంతుడుకు తప్ప వేరెవరుకి సూపర్ పవర్స్ ఉండవన్ నమ్ముతుంది. అందుచేతనే అక్కడ ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినట్లు సమాచారం. కువైట్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తూంటాయి. ఎందుకంటే తమిళులు అక్కడకి ఎక్కువ వలస వెళ్లారు. ఈ బ్యాన్ తో ఈ చిత్రం కొంతమేరకు బిజినెస్ కోల్పోతుందని ట్రేడ్ లో కంగారుపడుతున్నారు. అయితే కువైట్ లో సూర్యా సినిమా ఒక్కటే కాదు ఈ మధ్య వచ్చిన గంగ(ముని3) సినిమా కూడా బ్యాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: