టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే యంగ్ హీరోలు, టాప్ హీరోలు ఇలా ఎవరికి వారే నెంబర్ వన్ అంటూ, ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీలకు అస్సలు అంగీకరించని గత కాలం హీరోలు..ఇప్పుడు కొద్దిగా ఆలోచనలు మార్చకొని తోటి హీరోలతో స్క్రీన్ స్పేస్ ని పెంచుకుంటున్నారు.

అయితే ఈ మార్పు ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాదు. కోలీవుడ్ లోనూ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే నాగార్జున, కార్తిల మూవీనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ లో అనుష్క నటించబోతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టింది బెంగళూరు సుందరి అనుష్క.

అనంతరం నాగ్‌తో కలిసి రగడ, ఢమరుకం చిత్రాల్లో కథానాయికగా నటించింది. కెరీర్ ఆరంభం నుంచి ఇద్దరి మధ్య చక్కటి స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగార్జున నటిస్తున్న ఓ చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతుంది అనుష్క. నాగార్జున, కార్తీ హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న మల్టీస్టారర్ చిత్రం లో అనుష్క ఓ అతిథిపాత్రలో నటించనున్నట్లు సమాచారం.  

వంశీ పైడిపల్లి, నాగార్జున చేత అనుష్కని అడిగించడంతో...అనుష్క కాదనలేక వెంటనే ఒప్పుకుందట. పీవీపీ పతాకంపై ప్రసాద్.వి.పోట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అనుష్క బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌జీరో చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: