నటి శ్రద్ధదాస్ వరుస చిత్ర షూటింగులతో యమబిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం గుంటూరు టాకీస్. ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోలాండ్లో జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ఆమె రివాల్వర్ రాణీ పాత్ర పోషిస్తుంది. ఆ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా పోలాండ్ తరలి వెళ్లింది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అనంతపురం జిల్లా హిందూపురంలో జరుపుకున్న సంగతి తెలిసిందే.

"గుంటూరు టాకీస్" చిత్రం అటు హిందీ, ఇటు తెలుగు

పోలాండ్లో రివాల్వర్ రాణీ

"గుంటూరు టాకీస్" చిత్రం అటు హిందీ, ఇటు తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగు చిత్రంలో శ్రద్ధ సీఈవోగా నటిస్తుండగా... హిందీ చిత్రంలో జర్నలిస్ట్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలాండ్లోని క్రాకో నగరంలో దిగిన ఫోటోలను శ్రద్ధ తన మైక్రో బ్లాగ్లో ఉంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: