ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ఆరాధ్య కు తల్లి అయిన తరువాత 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నటిస్తున్న ‘జాజ్ బా’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ముంబాయిలో ఆమె చేసిన కామెంట్స్ మహేష్ నాగార్జునల మల్టీ స్టారర్ కు మళ్ళీ ప్రాణం పోసింది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ‘జాజ్ బా’ మీడియా సమావేశంలో ఐశ్వర్య ఈ కామెంట్స్ చేసింది. 

తన రీ ఎంట్రీ గత సంవత్సరం మణిరత్నం తీస్తాడు అనుకున్న ఒక దక్షిణాది మల్టీ స్టారర్ సినిమాతో ప్రారంభం అవుతుంది అని తాను మొదటిగా అనుకున్నా కొన్ని కారణాలు వల్ల క్రితం సంవత్సరం ప్రారంభం కావలసిన ఆ మల్టీ స్టారర్ ప్రారంభం కాకపోయినా తన సెకండ్ ఇన్నింగ్స్ కు సంబంధించి రెండవ సినిమాగా మణి రత్నం మల్టీ స్టారర్ మూవీ ఉంటుంది అని సూచన ప్రాయంగా లీక్ చేసింది ఐశ్వర్యా రాయ్.

దీనితో మణిరత్నం నాగార్జున మహేష్ లతో గత సంవత్సరం మొదలు పెడతాడు అనుకున్న మల్టీ స్టారర్ మళ్ళీ ప్రారంభం అవుతోంది అంటూ బాలీవుడ్ కోలీవుడ్ మీడియాలు వార్తలు వ్రాస్తున్నాయి. మణిరత్నం గత సంవత్సరం ఈ మల్టీ స్టారర్ విషయమై అనేక సార్లు హైదరాబాద్ వచ్చి నాగ్ మహేష్ లను కలవడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ విషయమై ఇంచుమించు అంతా ఫైనల్ చేసుకున్నాడు. అయితే ఆఖరి నిముషంలో మహేష్ కు ఈ మల్టీ స్టారర్ కథ విషయమై అనుమానం ఏర్పడటంతో ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అటకెక్కింది. 

అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం విడుదలైన ‘ఓకే బంగారం’ సూపర్ హిట్ కావడంతో ఈ మల్టీ స్టారర్ విషయమై మహేష్ నాగార్జునుల ఆలోచనలలో మార్పులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తు ఐశ్వర్య చేసిన కామెంట్స్ బట్టి ఈ మల్టీ స్టారర్ వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళవచ్చు అనే వార్తల హడావిడి మొదలైంది. నాగార్జునకు జంటగా ఐశ్వర్యా మహేష్ కు జంటగా శ్రుతిహాసన్ లు నటించబోయే ఈ సినిమా ఐశ్వర్యా రాయ్ మాటలు బట్టి తిరిగి ట్రాక్ పైకి ఎక్కబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: