మే 31వ తారీఖున జరగవలసిన ‘బాహుబలి’ ఆడియో వాయిదా పడటంతో ఇక అందరి దృష్టి అదేరోజు విడుదల చేయబోతున్న మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ పై ఆరోజునే బయట పడనున్న ఆ సినిమా ట్రైలర్ పై ఇప్పుడు వార్తల హడావిడి ఊపు అందుకుంది. జూలై లో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి మరొక లేటెస్ట్ విషయం బయటకు వచ్చింది. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమా సేటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానల్ జీ తెలుగు 10.5 కోట్లకు ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

‘వన్’, ‘ఆగడు’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా మహేష్ క్రేజ్ ఎక్కడా క్రేజ్ తగ్గలేదు అన్న విషయానికి ఇది ఉదాహరణ. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ సినిమా రైట్స్ ఈ రేంజ్‌లో వెళ్లిన సందర్భాలు లేవు అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే ‘శ్రీమంతుడు’ విడుదల కాకుండానే ఆ సినిమా నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తున్నట్లు అనుకోవాలి. 

గతంలో కొరటాల శివ ప్రభాస్‌తో తీసిన ‘మిర్చి’ సినిమా ఇమేజ్ కూడ ఈ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోవడానికి ఒక కారణం అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. అయితే నిన్న కొరటాల శివ చేసిన ట్విట్ ను ఆధారంగా తీసుకుంటే మే 31న ‘మహేష్ 21' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించినా ఆఖరి నిముషంలో ఈ ‘శ్రీమంతుడు’ టైటిల్ కు బదులు అందరి ఊహలను బ్లాంక్ చేస్తూ మరో కొత్త టైటిల్ పుట్టుకు వస్తుందా? అనే అనుమానం కూడా ఉంది. 

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సెంటిమెంట్ కొనసాగిస్తూ మహేష్ బయటపెట్టబోయే  తన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ గురించి మహేష్ అభిమానులు ఆ శక్తిగా ఎదురుచూస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: