సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీకి డైరెక్టర్ మారాలంటే సామాన్యవిషయం కాదు. అలాంటిది కేవలం మూడో సినిమాకే రజనీకాంత్ ని డైరెక్ట్ చేస్తూ, సౌత్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అలాగే రజనీకాంత్ అప్ కమింగ్ మూవీపై ఎటువంటి జాగ్రత్తులు తీసుకుంటున్నాడు అనే దానిపై వివరాలను తెలుసుకోవటానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, లింగా పరాజయం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించబోయే తదుపరి చిత్రంపై దక్షిణాది సినీవర్గాల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. పలువురు సీనియర్ దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ముందుకొచ్చారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమిళ యువ దర్శకుడు రంజిత్‌కు తన తదుపరి చిత్ర బాధ్యతల్ని అప్పగించారు రజనీకాంత్.

తమిళంలో అట్టాకత్తి మద్రాస్‌లాంటి వినూత్న కథా చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గుర్తింపును తెచ్చుకున్న రంజిత్ మూడో చిత్రానికే సూపర్‌స్టార్‌ను డైరెక్ట్ చేస్తుండటం తమిళ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది.

అలాగే రజనీకాంత్ లింగా తరహా కొత్త సబ్జెట్స్ ని ఎంచుకోకుండా, మాస్ స్టోరిని సెలక్ట్ చేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. జూలైలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: