రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కిక్‌ 2’ విడుదల  జూన్‌ 12న కూడ సాధ్యం కాదు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు బయ్యర్ల నుండి అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ సినిమాను ఖంగారు పడకుండా విడుదల చేద్దామాని నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమా విడుదలలో జరుగుతున్న ఆలశ్యo  ఛార్మీ ‘జ్యోతిలక్ష్మి’ కి అనుకూలంగా మారింది అని అంటున్నారు. 

పూరీజగన్నాథ్ మంచి అంచనాలతో తీసిన ‘జ్యోతి లక్ష్మి’ విడుదలకు సరైన డేట్‌ కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో ‘కిక్ 2’ విడుదల ఆలస్యాన్ని పూరీజగన్నాథ్ తనకు అనుకూలంగా మార్చుకుని ‘జ్యోతి లక్ష్మి’ ని జూన్‌ 12న విడుదల చేయడానికి  డిసైడ్‌ అయ్యాడు అని టాక్.

ఇంకా ఆడియో కూడా విడుదల కాకపోయినా మరో రెండు వారాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేయాలని పూరీజగన్నాథ్ నిశ్చయించుకున్న నేపధ్యంలో ఈ సినిమా ఆడియో విడుదల జూన్ 4న జరుగుతుంది అని అంటున్నారు. ఛార్మి వేశ్య పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే ట్రేడ్‌లో మంచి హైప్‌ ఉంది. 

మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే లక్షణాలు కనిపించడంతో ఈ చిత్రాన్ని బయ్యర్లు ఫాన్సీ రేట్లకి కొంటున్నారు అని టాక్. ఈమధ్య కాలంలో ఛార్మీకి ఎటువంటి హిట్ ఆమె కెరియర్ కు సంబంధించి లేకపోయిన నేపధ్యంలో ఈ సినిమాకు ఆమె ఘోస్ట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది అనే వార్తలు కూడ ఉన్నాయి. జూన్ లో పెద్ద సినిమాలు ఏమి లేని నేపధ్యంలో ఈ ‘జ్యోతిలక్ష్మి’ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని  ఛార్మి చాల ఆశలు పెట్టుకుంది. ఏది ఎలా ఉన్నా మొత్తం మీద ఛార్మీకి రవితేజా బంపర్ ఆఫర్ ఇచ్చాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: