పూరీజగన్నాధ్ ఈ మధ్య మాంచి ఊపు మీదే ఉన్నాడు, ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. చిరంజీవితో 150 సినిమా తీయడం కూడా గొప్ప చాలెంజ్ గా తీసుకున్నాడు. తాజాగా చార్మీ హీరోయిన్ గా జ్యోతి లక్ష్మి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే, చార్మీ ఇందులో వేశ్య పాత్రలో నటిస్తుంది. గతంలో కూడా ఈమె ఆ పాత్ర చేసి జనాలను మెప్పించింది. అంతే కాదు చార్మీకి సరైన హిట్లు లేక ఐటమ్ సాంగ్స్ కు ఫిక్సయిన సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా రావడం చార్మికి కూడా బాగా కలిసి వస్తుంది.

జ్యోతి లక్ష్మి పోస్టర్


ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ట్రేడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రూ.12-14 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని ప్రాథమిక సమాచారం. ఛార్మీ కౌర్ సమర్పణలో సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ శుభశ్వేత ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా జూన్ 12 రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత సీ.కళ్యాన్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: