తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన తాప్సీ, కొంత కాలం పాటు సినిమాలు లేక ఖాళీగా ఉన్న సందర్భాలు కూడ ఉన్నాయి. అయితే తను తాజాగా నటిస్తున్న చిత్రాలు అన్నీ, బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ ని సాధించడంతో తాప్సీకి కొద్దిగా బలం వచ్చినట్టయింది.

ఇదిలా ఉంటే తాజాగా తాప్సీని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న, తనకి కోపం తెచ్చింది. దీంతో కోపాన్ని ఆణుచుకోలేక అక్కడికక్కడే ఆ రిపోర్ట్ ని తిట్టింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగులో తొలిసారిగా తెరంగేట్రం చేసిన తాప్సీకి సరైన అవకాశాలు రాకపోవడంతో కెరీర్ ఓ గాడిన పడలేదు.

తమిళంలో కొన్ని చిత్రాలు చేసి, అటునుంచి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ బేబి చిత్రం హిట్టవ్వడంతో తన మనసులోని భావాలను బయటికి చెప్పేస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఓ ప్రవేట్ ఫంక్షన్ వెళ్ళిన తాప్సీని, బిటౌన్ రిపోర్టర్ వింత ప్రశ్న అడిగాడు. మీకు టాలీవుడ్ లో ఐరెన్ లెగ్ అనే బ్రాండ్ ఉంది. మరి బిటౌన్ రాణించగలరా? అని అన్నాడంట.

దీంతో తాప్సీ కి ఒళ్ళుమండి సుధీర్ఘ వివరణ ఇచ్చుకుంది. "నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు అందరూ అన్‌లక్కీ గాళ్ అని విమర్శించారు. మరి ఇప్పుడు సినిమాలు హిట్ అవుతున్నాయి కదా దీనికేమంటారు" అని ప్రశ్నించింది. "నా కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేదని ఎగతాళి చేశారు. మరి తమిళంలో, హిందీలో హిట్లు ఎలా పడ్డాయి. ఒక్క సినిమా ఫెయిలైతే బాధ్యతంతా నాదేనన్నారు. నేను కనిపించేది మొత్తం పదిపదిహేను సీన్లు మాత్రమే ఉంటాయి. దానికే మొత్తం ఫలితమంతా నేనే ప్రభావితం చేస్తానా?" అని ఘూటుగా ప్రశ్నించింది. దీంతో ఆ రిపోర్టర్ కాస్త వెనక్కితగ్గినట్టుగా బిటౌన్ టాక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: