పవన్ కళ్యాన్ తెరపై కనబడి చాలా రోజులే అయ్యింది, అత్తారింటికి దారేది తర్వాత మల్టీస్టార్ సినిమాల ‘గోపాల గోపాల ’ సినిమాలో కనిపించాడు. తర్వాత రాజకీయం విషయాల్లో పడి సినిమాలకు దాదాపు సంవత్సరం వరకు గ్యాప్ ఇచ్చడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ ల క్రేజీ కలయికలో అత్తారింటికి దారేది సినిమా తర్వాత మరో సినిమాకు సిద్దం అవుతున్నారు. వీరిద్దరి డ్రీమ్ ప్రాజెక్టు అయిన కోబలి (నరుకు బలి) పేరుతో రూపొందనుంది.


కోబలి ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తరువాత త్రివిక్రమ్ పవన్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని త్రివిక్రమ్ తెలిపారు. న్న ఈ సినిమాకోసం త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. విబిన్నమైన సినిమాగా తెరకేక్కే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లో  ప్రారంబం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: