గత కొద్ది రోజుల క్రితం రాజేంద్రప్రసాధ్ మా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం, ఆ హడావిడి మర్చిపోక ముందే రాజేంద్ర ప్రసాద్ ఓ సరికొత్త నిర్మాణ సంస్థని ప్రారంభించడం వంటివి అందరిని ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. అయితే మరింత షాకింగ్ గా అనిపించే న్యూస్ ఏమిటంటే రాజేంద్రప్రసాద్ స్థాపించిన క్రియేషన్స్ నుండి చరణ్ హీరోగా ఓ మూవీ రాబోతుందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఇచ్చిన మాటను తప్పకుండా పేద కళాకారులకు చేదోడు వాదోడుగా నిలుస్తు..వారి సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నటుడు శివాజీ రాజా ‘మా’ జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ రాజేంద్ర ప్రాసద్ కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే శివాజీ రాజా-రాజేంద్ర ప్రసాద్ అనుబంధం ఒక్క మా బంధం మాత్రమే కాదు.. గత 30 ఏళ్ళుగా మంచి మిత్రులుగా వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది.

అందులో భాగంగానే రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజా కలిసి ఒక కొత్త బ్యానర్ ను స్థాపించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలు కలిసి టీవి మరియు పిల్మ్ ప్రొడక్షన్స్ ను.. రాజా & రాజా క్రియేషన్స్ (ఆర్&ఆర్ ప్రొడక్షన్స్) పేరిట మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ తో రెండు సినిమాల్లో నటించి, మెగా ఫ్యామిలీ అనువుగా ఉండే రాజేంద్రప్రసాద్, తను కొత్తగా స్థాపించిన సంస్థ నుండి చరణ్ తో ఓ మూవీని తీయాలనే కోరికను మెగా ఫ్యామిలీ ముందు పెట్టడమే కాకుండా, అప్రూవల్ కూడ తీసుకున్నట్టు టాక్స్ వినిపిస్తుంది.

దీంతో రాజేంద్రప్రసాద్ స్థాపించిన ఆర్ అండ్ ఆర్ క్రియేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో రాజేంద్రప్రసాద్ నిర్మాతగా మారి, తనతో మూవీని తీస్తాడని చరణ్ ఎంత మాత్రం ఊహించలేదంటూ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: