రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘బాహుబలి’ ఆడియో వేడుకలు ఈనెల 31 న ఎంతో గ్రాండ్ గా జరుగుతుందని చిత్ర యూనిట్ మరియు తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు అనుకున్నారు. కానీ సెక్యూరిటీ ఇబ్బంది వలన ఆ రోజు ఆడియో వేడులు జరపలేక పోతున్నామని మొన్న ప్రభాస్ అభిమానులను క్షమించమని కోరాడు. అంతే కాదు దర్శక, నిర్మాతలు కూడా ఎంతో చింతిస్తున్నామని సినిమా గురించి ఎంతో చెప్పాలని ఇంతకాలం వేచి చూసిన అభిమానులకు నిరుత్సాహం కలిగించినందుకు సారీ చెప్పారు రాజమౌళి.


బాహుబలిగా ప్రభాస్


సినిమా ఆడియో వేడుక రోజు ట్రైలర్ విడుదల చేయడం ఆనవాయితీ అయితే  ట్రైలర్ ను బట్టి సినిమాపై అంచనా వేసుకోవచ్చు. కానీ ఆడియో వేడుక క్యాన్సిల్ కావడంతో  ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అనే విషయంలోనూ క్లారిటీ లేకుండా పోయింది అంతే కాదు ఆ రోజు రాజమౌళి కూడా ట్రైలర్ విషయం  ఏమీ చెప్పలేదు.  తాజాగా రాజమౌళి అభిమానులకు తన ట్విట్టర్ ద్వారా ఓ తీపి కబురు అందించాడు. ఈ రోజు రాత్రి ‘బాహుబలి’ కి సంబంధించిన 5 సెకన్ల టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అభిమానులు నిరుత్సాహం చెందకుండా తమను అపార్థం చేసుకోకుండా ఉండటం కోసం ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. 

రాజమౌళి ట్విట్

మరింత సమాచారం తెలుసుకోండి: