‘ఊహలు గుసగుసలాడే' సినిమా తరువాత టాలీవుడ్ లో వరసపెట్టి అవకాశాలు అందుకుంటూ యూత్ లో తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పరుచుకున్న రాశి ఖన్నాకు నిన్న ఒక చేదుఅనుభవం ఎదురైనట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాశి ఖన్నా నిన్న నెల్లూరులో మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కు ఈ బ్యూటీని అతిధిగా పిలిచినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ నుండి రేణిగుంట ఎయిర్ పోర్ట్ వరకు విమానంలో వెళ్ళిన రాశి ఖన్నా అక్కడ నుండి కారులో నెల్లూరు వెళ్ళడానికి తన ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్. అయితే ఆమెను రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పికప్ చేసుకుని నెల్లూరు తీసుకు రావడానికి ఒక కారును ఆ షాప్ యాజమాన్యం ఎంగేజ్ చేసారని తెలుస్తోంది. 

అయితే అనుకోకుండా ఆ కారు డ్రైవర్ తన రూట్ కన్ఫూజ్ అవడంతో దారి మరిచి రాంగ్ డైరక్షన్ లో వెళ్లాడట. దీనివల్ల రాశి ఖన్నా షాపు ఇనాగరేషన్ కు రావడానికి లేట్ అయ్యింది అని తెలుస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ నెల్లూరులోని లోకల్ మీడియా ఆ కార్యక్రమానికి రాశి ఖన్నా ఎంత సేపటికీ రాకపోవడం చూసి రాశి ఖన్నా మిస్సైందంటూ వార్తలు లీక్ చేసింది అని తెలుస్తోంది. 

అయితే ఈ విషయాన్ని ఎంత దాచుదామని ప్రయత్నించినా బయటకు పొక్కడంతో ఆ షాపు యాజమాన్యం వారు రాశి ఖన్నా ప్రయాణిస్తున్న కారు దారి తప్పింది అంటూ అసలు విషయాన్ని బయట పెట్టారట. చివరికి ఆ షాపు ఓపెనింగ్ కు 11:45 కు రావలసిన రాశి ఖన్నా రెండు గంటలకు ఆమె షాపు వద్దకు చేరుకుని షాపు ఓపెనింగ్ చేసింది అని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో జరిగిన రగడ అటు రాశి ఖన్నాకు ఇటు ఆ షాపు యజమానికి  తల నొప్పిగా మారిందని టాక్. ఏమైనా ఇది రాశి ఖన్నాకు జీవితంలో ఒక చేదు అనుభవం అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: