ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్న స్టార్ హీరోలు, అలాగే అప్ కమింగ్ యాక్టర్స్ అంతా, ఏదొక విధంగా స్టార్ డంని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విధంగా సంపూర్ణేష్ సైతం, సరికొత్త ప్రయత్నంతో సిల్వర్ స్క్రీన్ కి వచ్చి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఈ హీరో, నందమూరి నట సింహం అయిన బాలయ్యని టచ్ చేశాడని టాక్స్ వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తొలి సినిమా హృదయ కాలేయంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోల కన్నా బిజీగా మారిపోయాడు. ఓ వైపు హీరోగా పలు సినిమాల్లో నటిస్తూనే కమెడియన్ గానూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక పబ్లిసిటీ విషయంలో సోషల్ నెట్వర్క్ ను ఉపయోగించుకోవడం ఎలాగో ఈ బర్నింగ్ స్టార్ ను చూసే నేర్చుకోవాలి.


ఇక ఇలాంటి హీరోకు ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్ నుంచి పిలుపు రావడమే ఆలస్యం ఓ రేంజ్ లో హంగామా చేసేస్తాడు. కానీ, సంపూ మాత్రం ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా సెటైర్లు వేస్తున్నాడు. ఈ మధ్య ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్ కు హాజరయ్యే ఛాన్స్ లభించినా మనోడు వాడుకోలేదు. ఇక.. పబ్లిసిటీ, ప్రమోషనల్ ఈవెంట్స్ అంటే పడిచచ్చే సంపూ.. ఇకపై తాను వాటికి దూరంగా ఉంటానని, కెరీర్ తో పాటు సినిమాకు ఉపయోగపడుతుందనుకుంటేనే వెళ్తానని.. లేదంటే వెళ్లనని చెప్పేస్తున్నాడు.

అయితే సంపూర్ణేష్ కి బాలక్రిష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రం తెగ ఇష్టం. ఆ మూవీకి సంబంధించిన సీక్వెల్ ని కామెడీగా తెరకెక్కించాలనేది సంపూ కోరికగా ఫిల్మ్ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే, తను తీయబోతున్న ఆ మూవీకి మొదటగా బాలయ్య బాబు పర్మిషన్ తీసుకోవాలని, సంపూ తన స్నేహితుల మధ్య చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందుకు బాలక్రిష్ణ ఒప్పుకుంటాడో? లేదో? అనేది ప్రశ్నగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: