రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ వర్క్స్ ఊపందుకున్నాయి. జూలై 10న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇక రాజమౌళి అయితే ఈ సినిమాకు సంబందించి ప్రతి అంశం తన ట్విట్టర్ లో పెడుతున్నాడు.  ఇప్పటి వరకు బాహుబలికి సంబంధించి వర్కింగ్ స్టిల్స్,పోస్టర్లు, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా "బాహుబలి" డైలగ్స్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఎస్ఎస్ రాజమౌళి 31 సెకన్స్ నిడివితో కూడిన డైలాగ్స్ ట్రైలర్‌ను విడుదలచేశారు.

బాహుబలి  లో ప్రభాస్


ఇందులో రానా, అనుష్కల మధ్య సంభాషణ, మరికొన్ని దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. రానా బల్లాల దేవగా చాలా సీరియస్ మోడ్ లో కనిపిస్తున్నాడు.  అనుష్క రాజమాతగా సంకెళ్లతో కనిపిస్తుంది.   "చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతులతో చంపాలని నేను..." అని అనుష్కను ఉద్దేశించి రానా అంటే, "మాహిష్మతీ... ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు" అని అనుష్క చెప్పే చూస్తుంటే సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అని అర్థమవుతుంది. కాకపోతే ఈ ట్రైలర్ లో ప్రభాస్  గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడు. ఈ ట్రైలర్ ఈ చిత్రం విడుదలైన కేవలం ఆరు గంటల్లోనే లక్ష పాతిక వేల మందికి పైగా వీక్షించడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: