మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించబోతున్న ‘బ్రహ్మోతవం’ సినిమా పై అల్లు అర్జున్ ప్రభావం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.  జులై 10 నుండి ‘బ్రహ్మోతవం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.  మహేష్ తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత లతో నటిస్తున్న ఈసినిమా స్టొరీ లైన్ ఫిలింనగర్ లో లీక్ అయ్యింది.

అయితే ఈ స్టొరీ లైన్ పై అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ప్రభావం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.  ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో సత్యరాజ్, రేవతిలు మహేష్ బాబు తల్లిదండ్రుల పాత్రలో కనిపించనున్నారు. తండ్రి సత్యరాజ్, కొడుకు మహేష్ బాబు మధ్య బంధాన్ని ఈచిత్రంలో అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్నారట. తల్లి రేవతి కుటుంబానికి సంబంధించిన అంశాలు ఈ సినిమా కధలో కీలకం. 

కుటుంబ విలువల గురించి హీరో ఎలా రియలైజ్ అయ్యాడు అనే మెయిన్ కాన్సెప్ట్ పై ఈ సినిమా కధను శ్రీకాంత్ అడ్డాల అల్లాడు అని టాక్. త్రివిక్రమ్ తీసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లోని విలువల ప్రస్తావన ‘బ్రహ్మోత్సవం’ లో కూడ కనబడబోతోందని టాక్. మహేష్ తో నటిస్తున్న ముగ్గరు హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉండటంతో టాప్ హీరోయిన్స్ ముగ్గురూ ఈ సినిమా ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు అనే వార్తలు ఉన్నాయి.

సినిమాను జులై 10న మొదలు పెట్టి  నాన్ స్టాప్ షూటింగ్ జరిపి డిసెంబర్ 18న ఆడియో విడుదల చేసి, జనవరి 8, 2016న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలన్న మహేష్ ప్లాన్ వర్క్ అవుట్ అయితే మరోసారి సంక్రాంతి బరిలో మహేష్ నిలబదబోతున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: