తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ప్రిన్స్ మహేష్ బాబు వెండితెరకు పరచయం అయ్యాడు. పోకిరి సినిమాతో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మహేష్ తెలుగులో నే కాకుండా బాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు. ఇప్పుడు ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలో  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో, ప్రసాద్.వి.పొట్లూరి నిర్మాణ సారధ్యంలో బ్రహ్మోత్సవం సినిమా రాబోతుంది. ఈ షూటంగ్ ‘బాహుబలి’ రిలీజ్ అంటే జూలై 10 న ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మహేష్ ఇద్దరు హీరోయిన్లతో నటించాడు కానీ ఈ బ్రహ్మోత్సవం సినిమాలో ముగ్గు అగ్ర హీరోయిన్లతో ఆడీ పాడబోతున్నాడు. అందులో ఇద్దరు హీరోయిన్లు మనోడితో ఆడి పాడినవారే.. ఒకరు సమంత, కాజల్.  ఆ మధ్య వచ్చిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ సరసన సమంత నటించింది.


మహేష్ బాబు బ్రహ్మోత్సం


కాజల్ బిజినె మేన్ లో నటించింది. ఇక ప్రణిత ఇప్పటి వరకు మహేస్ కు జోడిగా నటించలేదు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్ద ప్రెస్ నోట్ విడుజల చేసింది. ఇక ఇటీవల లాంఛనంగా ఫ్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న 'బ్రహ్మోత్సవం' విడుదల చేయనున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: