సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’, ‘పండగ చేస్కో’ లాంటి వరుస విజయాలతో సూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ గా మారిన ఈ Lప్రస్తుతం ఈ భామ నటించిన కిక్ 2 సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంటే, మరో వైపు రకుల్ హీరోయిన్ గా నటించనున్న రామ్ చరణ్,ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళే పనిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు సరసన ఆఫర్ మిస్ చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలను తనే స్వయంగా చెప్పుకుంది. ‘ నేను మహేష్ బాబుతో నటించాలని ఎంతో ఇష్టపడ్డాను. కానీ ఆ మూవీ మేకర్స్ జూలై లోనే కాల్షీట్స్ కావాలని అడిగారు. కానీ జూలై మొత్తం ఎన్.టి.ఆర్ ,రామ్ చరణ్ సినిమాలకు డేట్స్ ఇచ్చేశాను.

చివరికి చేసేదేమీ లేక మహేష్ సినిమా వదులుకున్నాను. ఇది బాధాకరమైన విషయమని’ తెలిపింది. నిజానికి తను డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిన తరువాత, మహేష్ తో మరో మూవీకి చేయాలని, మహేష్ తెగ బ్రతిమిలాడిందట. అయితే అందుకు మహేష్ నిరాకరించాడు. అంతే కాకుండా రకుల్ విపరీతమై ఫోన్ కాల్స్ చేస్తుంటే, తనని అస్సలు పట్టించుకోలేదంట మన ప్రిన్స్.

అంతే కదా.. ఒకసారి ప్రిన్స్ సరసన ఛాన్స్ వస్తే ఎవరైనా ఒప్పుకోకపోతే ఇలాగే జరుగుతుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. త్వరలోనే ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: